🛒 ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్! ఇక 12 గంటల పాటు రేషన్ షాపులు ఓపెన్ | Ap Ration Shops 12 Hours Open
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు శుభవార్త తెలిపింది. ఇకపై తిరుపతి, రాజమహేంద్రవరం, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ నగరాల్లోని రేషన్ షాపులు పైలట్ ప్రాజెక్ట్గా రోజుకు 12 గంటల పాటు తెరిచి ఉండేలా నిర్ణయం తీసుకుంది. కొన్ని రేషన్ దుకాణాలను “మినీ మాల్స్”గా మార్చి, అక్కడ బియ్యం, పిండి, నూనెతో పాటు ఇతర నిత్యావసర వస్తువులు కూడా విక్రయించనున్నారు. ఈ కొత్త విధానం ద్వారా ప్రజలకు ఎక్కువ సౌకర్యం లభించడంతో పాటు, డీలర్లకు కూడా అదనపు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్రాజెక్ట్ విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.